మోడీని ఎందుకు పిలవాలి?

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీని పిలవకపోవడంపై విలేఖరి అడిగిన ప్రశ్నకు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రతిదానికి ప్రధానిని పిలవాలా? సంతృప్తిగా నేను ప్రారంభోత్సవం చేస్తున్నా మీకు ఇష్టంలేదా?, కేంద్రం నుండి  ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా రాలేదు అన్నారు. 

మరి ప్రాజెక్ట్ అనుమతులను కేంద్రమే ఇచ్చింది కదా!, అని అడిగిన ప్రశ్నకు అనుమతులను తెచ్చుకోవడం తమకు ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అనుమతి ఇచ్చే శాఖలు, సంస్థలు చట్టప్రకారం పనిచేస్తాయని తెలిపారు.     

మరి అప్పట్లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి పిలిచారు కదా!, అని మరో విలేఖరి అడుగగా, మిషన్ భగీరథ మరియు కాకతీయ ప్రాజెక్టులకు 24 వేల కోట్ల రూపాయలను ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసింది. అప్పుడు మోడీని పిలిచినా కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్రం నుండి రాష్ట్రానికి హక్కుగా రావలసినవి తప్ప జాతీయ ప్రాజెక్టు గాని, అదనంగా నిధులు గాని రాలేదు. అని సమాధానమిచ్చారు. 

మోడీతో గత పాలనాకాలంలో ఉన్నట్లుగా సత్సంబంధాలు లేవా?, అనే ప్రశ్నకు అప్పుడు మోడీ ప్రధాని అయిన సందర్భంలో అతి కఠినంగా నిందించిన వ్యక్తిని నేను. ఏడు మండలాలు, సీలేరు పవర్‌ ప్లాంటు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినప్పుడు ఫాసిస్టు పిఎం అని అన్నాను. అని సమాధానమిచ్చారు. మరి రాష్ట్రపతి ఎన్నికలలో సహకరించారు కదా అని అడుగగా, కేంద్ర ప్రభుత్వానికి మేం అంశాల వారీగా మద్దతు ఇచ్చాం. మాకు నచ్చిన వాటికి మద్దతిచ్చాం, నచ్చని వాటిని వ్యతిరేకించాం. ప్రత్యేకించి మిత్రత్వమో, శత్రుత్వమో లేదు. అంటూ ముక్తాయించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post