ఇంటర్ ఫలితాలపై కావాలనే దుష్ప్రచారం?

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన అనంతరం, మూల్యాంకనంలో పెద్ద ఎత్తున పొరపాట్లు జరిగాయని వార్తలు వచ్చాయి. అయితే కొందరు కావాలనే తమపై ఈ తరహా దుష్ప్రచారాన్ని చేశారని ప్రభుత్వం భావిస్తుంది. 

ఇంటర్‌లో ఫెయిల్ అయిన, రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న 3.82 లక్షల మంది విద్యార్థులలో కేవలం 1183 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని బోర్డు వెల్లడించింది. వీరిలో కూడా ఎక్కువమంది 3,4 మార్కుల తేడాతో ఫెయిల్ కావడంతో, మానవతా దృక్పథంతోనే పాస్ అయ్యారని, భారీగా మార్కులు తేడా రావడం అనేది కేవలం 10 సందర్భాలలోనే జరిగిందని, అవి కూడా సాంకేతిక కారణాల వల్లే జరిగాయని వారి వాదనగా ఉంది. ఇవే కారణాలపై హైకోర్టులో కొంతమంది దాఖలు చేసిన పిటీషన్లను కోర్టు కొట్టివేసింది. 

మూల్యాంకనంలో జరిగిన, ఆ కొన్ని పొరపాట్లకు కూడా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. మళ్ళీ ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా కూడా చర్యలు చేపట్టనుంది. లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని, రీ-వెరిఫికేషన్ తరువాత కూడా లక్షలాది మంది పాస్ అయ్యారని వదంతులు ఎక్కడ నుండి వ్యాప్తి చెందాయో కూడా విచారణ జరపాలని యోచిస్తోంది. 23 మంది మృతి చెందారన్న వార్తలపై కూడా స్పందిస్తూ, ఆ స్థాయి విద్యలో విపరీతమైన ఒత్తిడి నెలకొందని, దానిని తగ్గించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, ఇంటర్ బోర్డును ఉంచాలా? రద్దు చేయాలా అనే విషయాలపై కూడా కమిటీని వేయనున్నారు.                            

0/Post a Comment/Comments

Previous Post Next Post