టిఆర్ఎస్ బిజెపిలు రెండూ మిత్రపక్షాలే

టిఆర్ఎస్ బిజెపిలు రెండూ మిత్రపక్షాలే
బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని ఇతర హామీలను నెరవేర్చటంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై అధికార టిఆర్ఎస్ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని సీపీఎం కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రశ్నించారు. 

ఆదివారం ఖమ్మంలో జరిగిన బహుజన వామపక్ష పార్టీ (బిఎఫ్ఎఫ్) ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశంలో ప్రసంగిస్తూ, టిఆర్ఎస్ పై విరుచుకపడ్డారు. ఆ పార్టీ బహిరంగంగా నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు మద్ధతు తెలిపిందని, నోట్ల రద్దు సమయంలోనే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేసిందని దుయ్యబట్టారు. టిఆర్ఎస్ కు బిజెపితో ఒప్పందం ఉందని, రెండూ మిత్రపక్షాలేనని ఆయన వ్యాఖ్యానించారు. 

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో, విభజన హామీలపై కేంద్రం పై ఒత్తిడి చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.  ఎస్సిలు, ఎస్టీలు, బిసిలు, మైనారిటీలు, మరియు ఇతర పేద వర్గాలన్నీ బిఎల్ఎఫ్ కు మద్దతిచ్చి టిఆర్ఎస్ ను మట్టి కరిపించాలని ఆయన పిలుపునిచ్చారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post