బోనాల ఉత్సవాలు ప్రారంభం

బోనాల ఉత్సవాలు ప్రారంభం
ఆషాఢ మాస సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల ఉత్సవాలు ఆదివారం రోజు గోల్కొండలో జరిగిన వేడుకలతో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 

ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, మంత్రులు నాయని నర్సింహా రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పూజలు జరిపి లంగర్ హౌస్ నుండి ప్రారంభమయ్యే ఊరేగింపును మొదలుపెట్టారు. ఊరేగింపు ముగిసిన అనంతరం గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. కోటపైకి వెళ్లే మెట్లను పసుపు, కుంకుమలతో అలంకరించారు. 

గోల్కొండ వేడుకలతో హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లు భావిస్తారు. ఆ తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలలో బోనాలు జరగటం ప్రారంభమవుతాయి. ఈ నెల 29, 30 వ తేదీలలో జరుగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, తర్వాత వారం జరిగే లాల్ దర్వాజ అమ్మవారి బోనాలతో  ఉత్సవ సంరంభం పతాకస్థాయికి చేరుతుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post