రియాలిటీ షోను అనుకరించబోయి ఓ యువకుడు మృతి |
రియాలిటీ షోను అనుకరించబోయి ఓ యువకుడు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలోని జాన్మాల్ లో చోటుచేసుకుంది. అతని స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 7వ తేదీన 22 ఏళ్ల జలాలుద్దీన్ రియాలిటీ షోను ప్రదర్శిస్తానని అన్నాడు. తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నా తనకేమీ కాదని చెప్తూ, వారి ఎదుటే నిప్పటించుకుని తీవ్రంగా గాయాలపాలై ఆసుపత్రిలో చేరాడు. వెంటనే స్నేహితులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు.
Post a Comment