యాదాద్రి కళ్యాణ వేడుక నుంచి అర్ధంతరంగా వెళ్ళిపోయిన గవర్నర్

యాదాద్రి కల్యాణ వేడుక నుంచి అర్ధంతరంగా వెళ్ళిపోయిన గవర్నర్
యాదాద్రి కల్యాణ వేడుక నుంచి అర్ధంతరంగా వెళ్ళిపోయిన గవర్నర్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ రాత్రి 8:30 గంటలకు వచ్చారు. ఎప్పుడూ భక్తిశ్రద్ధలతో, దైవ కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించే గవర్నర్  ఆలయ ఈవో గీతారెడ్డిని ఆలస్యం పై  ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరికొందరు ప్రజాప్రతినిధులు రావాల్సి ఉందనీ , అందుకే ఆలస్యమవుతోందని ఈవో బదులిచ్చినట్టు సమాచారం. చివరకు 10:45 వరకు వేచిచూసిన నరసింహన్ సతీసమేతంగా కళ్యాణ వేడుక నుంచి లేచి వెళ్లిపోయారు. గవర్నర్ వెళ్లిన తర్వాత మరో నలభై నిమిషాలకు అంటే 11: 25 నిమిషాలకు స్వామి వారి కళ్యాణ ఘట్టం పూర్తయింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post