కోహ్లి మళ్లీ 'ఛేజ్' చేసాడు

కోహ్లి మళ్లీ 'ఛేజ్' చేసాడు
కోహ్లి మళ్లీ 'ఛేజ్' చేసాడు
మొదట బాటింగ్ చేసినప్పటి కన్నా రన్ ఛేజ్ చేసేటప్పుడే ఎక్కువ రాణించే విరాట్ కోహ్లి, మరోసారి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేయగా, భారత్ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.  ఉదయం కురిసిన భారీ వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. భారత్ కు అతి ముఖ్యమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

స్పిన్ కు అధికంగా సహకరించిన ఈ పిచ్ లో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ రన్స్ సాధించటానికి ఇబ్బంది పడింది. చివర్లో ఉమర్ అక్మల్ (16 బంతుల్లో 22), షోయబ్ మాలిక్ (16 బంతుల్లో 26) రాణించటంతో 118 పరుగులు చేయగలిగింది. లక్ష్యఛేదన ప్రారంభించిన భారత్ కూడా 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయం లో కోహ్లి (37 బంతుల్లో 55) తో జత కలసిన యువరాజ్ (23 బంతుల్లో 24) రాణించటం తో విజయం సులభమైంది. ఈ విజయం తో భారత్ 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post