వారం రోజుల్లో కేంద్రానికి పోలవరం డాక్యుమెంట్లు

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ఈ వారంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలియజేసారు. 

ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కే.ఎల్.రావు యొక్క 116వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేసారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచనల మేరకు ఇలా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే వారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే ప్రయత్నం చేయనున్నాయి.

చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగష్టు 15 నాటికి పూర్తి చేస్తామని, 2019 ఫిబ్రవరి నాటికి పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని మంత్రి విశ్వాసం వ్యక్తం చేసారు. సంవత్సరం లోపల ప్రకాశం బారేజ్ దిగువన చోడవరం డ్యామ్ నిర్మిస్తామని ఆయన తెలిపారు.  కే.ఎల్.రావు యొక్క నైపుణ్యం హరిత విప్లవానికి దోహదం చేసిందని మంత్రి తన అభిప్రాయం వెలిబుచ్చారు. గంగ కావేరి అనుసంధానం గురించి కే.ఎల్.రావు గారే మొదటిసారిగా మాట్లాడారని, ఆయన అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసారని మంత్రి అన్నారు. 

ఈ సమావేశానికి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వర రావు, ఇ.ఎన్.సి. (పరిపాలన) కె. శ్రీనివాస్, కృష్ణ డెల్టా చీఫ్ ఇంజనీర్ ఆర్.సతీష్ కుమార్, మరియు అపెక్స్ కమిటీ సభ్యుడు అల్లా గోపాలకృష్ణ హాజరయ్యారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post