![]() |
ప్రాజెక్ట్ రీ డిజైన్ వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం |
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్ రీ డిజైన్ వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతుందని బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి ఒంగోలు వచ్చిన మాజీ కేంద్ర మంత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.
బిజెపి పార్టీ, గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి నినాదం తో ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి సందర్భంగా జనంలోకి వెళ్లనుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పంట నష్టపోతే 25% పరిహారం 15 రోజుల్లో అందేలా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. తన సోదరుడు బాలకృష్ణ నటించనున్న గౌతమీపుత్ర శాతకర్ణి గురించి మాట్లాడుతూ తెలుగువారి చరిత్రను దేశ వ్యాప్తం చేసే విధంగా తీస్తున్న చారిత్రక సినిమా లో నటించనుండడం అభినందనీయమన్నారు.
Post a Comment