కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానంపై అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఆ విధానం వలన లాభనష్టాలను పక్కన పెడితే, దీనిపై టిఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి మాత్రం గందరగోళంగానే ఉంది.
గత సంవత్సరం కేంద్రంతో జమిలి ఎన్నికలపై అనుకూల వైఖరిని వ్యక్తం చేసి, అసెంబ్లీని ముందుగానే రద్ధు చేసి రెండు ఎన్నికలు, ఒకేసారి జరగకుండా వ్యవహరించింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఏ ప్రాతిపదికన అనుకూలత వ్యక్తం చేస్తున్నారో స్పష్టం చేయలేదు.
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలలో జాతీయ సమస్యలు, విధానాలు, రాష్ట్రాల ఎన్నికలలో స్థానిక సమస్యలు, జనాకర్షక పథకాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరగడం వలన జాతీయ పార్టీలు బలపడి, ప్రాంతీయ పార్టీలు బలహీనపడే అవకాశముంది. ఈ విధానాన్ని దేశంలోని మెజారిటీ ప్రాంతీయ పార్టీలు ఎందుకు సమర్థిస్తున్నాయో అర్థం చేసుకోవడం కష్టమే.
Post a Comment