టిఆర్ఎస్ మద్ధతు కోరిన తెలుగు దేశం ఎంపీలు

టిఆర్ఎస్ మద్ధతు కోరిన తెలుగు దేశం ఎంపీలు
జులై 18 నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలలో తమ నిరసన గళాన్ని గట్టిగా వినిపించేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. దీనికోసం ఇతర పార్టీల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీలు సుజనాచౌదరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శ్రీరాం మాల్యాద్రిలు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు నాటికి వెళ్లి పార్లమెంట్లో తమ డిమాండ్లకు మద్దతు తెలుపవలసిందిగా కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారని సుజనా చౌదరి వెల్లడించారు. 

కేశవరావు మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయటం తెలంగాణ రాష్ట్రానికి కూడా అవసరమని అన్నారు.  మరో ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ దఫా పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెడతామన్న అవిశ్వాస తీర్మానం  గురించి ప్రస్తావించారో, లేదో తెలియరాలేదు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post