అన్నా క్యాంటీన్ ప్రచారానికి రాజన్న క్యాంటీన్ ఫోటో


జులై 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఆర్భాటంగా ప్రారంభించింది. కానీ వీటి పబ్లిసిటీ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ క్యాంటీన్ల  ప్రకటనలలో మరియు హోర్డింగ్స్ లో రాజన్న క్యాంటీన్లో తింటున్న ఇద్దరు వ్యక్తుల ఫోటోను వాడుకున్నారు. ఈ రాజన్న క్యాన్టీన్లు 2017 లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ప్రారంభించినవి కావటం విశేషం. ఈ ఫోటో ఫేస్ బుక్ మరియు ఇతర సోషల్ మీడియాలో ఆ సమయంలోనే విస్తృతంగా షేర్ చేయబడింది. 

ఇద్దరు వ్యక్తుల ఫోటో - ఒక ముస్లిం, మరో భుజం పైన టవల్ తో ఉన్న వ్యక్తి. అన్నా క్యాంటీన్ల న్యూస్ పేపర్ ప్రకటనలో, పట్టణాలలో ఉన్న హోర్డింగ్స్  లో ప్రముఖంగా దర్శనమిచ్చారు. ఈ ఫోటోలను పోలుస్తూ సోషల్ మీడియాలో మొదలైన ట్రోలింగ్ వైరల్ గా మారింది. 

ఈ నెలలో సమాచారం మరియు పబ్లిక్ రిలేషన్స్ (ఐ  & పిఆర్) అధికారులు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటు వారి చేత ఈ ప్రకటనలు  జారీ చేయబడ్డాయి. వారు దీనిపై ఇంకా ఏమీ సమాధానం ఇవ్వలేదు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post