సీజేఐ అధికారాలను ప్రశ్నించలేరు

సీజేఐ అధికారాలను ప్రశ్నించలేరు
కేసుల కేటాయింపు, ధర్మాసనాల ఏర్పాటులో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కి ఉన్న విశేష అధికారాలను ఎవరూ ప్రశ్నించజాలరని సుప్రీమ్ కోర్ట్ తేల్చి చెప్పింది. ఆయనే మాస్టర్ ఆఫ్ ది రోస్టర్‌ అని, ఆయనకు ధర్మాసనాలకు కేసులను కేటాయించే విచక్షణాధికారం ఉంటుందని ఈ మేరకు తీర్పులో స్పష్టం చేసింది. 

కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్‌ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసులను హేతుబద్ధంగా, పారదర్శకంగా కేటాయించేందుకు, ధర్మాసనాల ఏర్పాటుకు మార్గదర్శకాలను రూపొందించాలని ఆయన సూచించగా సుప్రీంకోర్టు కోర్టు కొట్టివేసింది. కోర్టు పాలనా వ్యవహారాలకు భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని, ఆయనకు విశేషాధికారాలుంటాయని స్పష్టం చేసింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post