పశ్చిమ్‌ బంగ, అసోం రాష్ట్రాలలో భారీ పోలింగ్

పశ్చిమ్‌ బంగ, అసోం రాష్ట్రాలలో భారీ పోలింగ్
పశ్చిమ్‌ బంగ, అసోం రాష్ట్రాలలో భారీ పోలింగ్
పశ్చిమ్‌ బంగ, అసోం రాష్ట్రాలలో సోమవారం నాడు జరిగిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికలలో భారీ పోలింగ్ నమోదైంది. అసోం లో 78.06%, పశ్చిమ్‌ బంగ లో 80% వరకూ పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల  ప్రక్రియ 7 గంటల నుండి పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకూ ప్రశాంతంగా జరిగింది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరిపారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ  ఎన్నికల్లో భాగంగా తోలి దశ లో పశ్చిమ్‌ బంగ లో 18 స్థానాలకు ఎన్నికలు జరుగగా, 133 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అలాగే అసోంలో 65 స్థానాలకు 539 మంది పోటీ పడ్డారు. రెండవ దశ ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగనున్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post