మిస్ ఇండియాగా ప్రియదర్శిని ఛటర్జీ |
ఎఫ్బిబి ఫెమినా మిస్ ఇండియా ఫైనల్స్ శనివారం రాత్రి ముంబయిలో అట్టహాసంగా జరిగాయి. ఫైనల్కి చేరుకున్న 21 మంది అభ్యర్థుల్లో దిల్లీకి చెందిన ప్రియదర్శిని ఛటర్జీ మిస్ ఇండియా వరల్డ్- 2016 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఉత్కంఠ భరితమైన వాతావరణంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ విజేత పేరును ప్రకటించారు. ఈమె మిస్ యూనివర్స్ పోటీలకు ఇండియా ప్రతినిధిగా వెళ్లనున్నారు.
ఈ పోటీల్లో బెంగళూరుకి చెందిన సుశ్రుతి కృష్ణ మొదటి రన్నరప్గా నిలవగా, లక్నోకి చెందిన పంఖుడి గిడ్వాని రెండో రన్నరప్గా నిలిచింది. కరణ్ జోహార్, మనీశ్ పాల్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా సంజయ్దత్, యామీ గౌతమ్, అర్జున్కపూర్, కబీర్ ఖాన్, అమీ జాక్సన్, మిరాయా లలాగున, సానియామీర్జా, ఏక్తాకపూర్, మనీశ్ మల్హోత్ర, షేన్ పీకాక్లు వ్యవహరించారు.ప్రముఖ డిజైనర్లు అంజు మోదీ, నమత్ర జోషిపుర, ఫాల్గుణి, షేన్ పీకాక్లు ఈ పోటీల్లో పాల్గొన్న వారి దుస్తులను డిజైన్ చేసారు.
— News World India (@NewsWorldIN) April 10, 2016
The Crowning Moment!— Triumph Intl India (@Triumph_India) April 10, 2016
Miss India 2015, @AryaAditi & the new @feminamissindia 2016, #PriyadarshiniChatterjee! pic.twitter.com/VyJ8zYcKKi
Post a Comment