కాల్పులతో విద్యుత్ తీగలు తెగి 11 మంది మృతి

కాల్పులతో విద్యుత్ తీగలు తెగి 11 మంది మృతి
కాల్పులతో విద్యుత్ తీగలు తెగి 11 మంది మృతి
పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడం వల్ల విద్యుత్ తీగలు తెగి జనం పై పడ్డాయి. ఇవి హై వోల్టేజ్ తీగలు కావటం తో 11 మంది మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణమైన ఘటన అస్సాం లోని టిన్‌సుకియా జిల్లా పన్‌గిరిలో జరిగింది. గాయపడ్డవారిని వీరిని టిన్‌సుకియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

మూడు రోజుల కిందట పన్‌గిరిలో జరిగిన గొడవలలో ఇద్దరు వ్యక్తులు హత్య చేయబడ్డారు. ఈ కేసులో కొందరిని పోలీసులు అరెస్టు చేయటంతో,  అరెస్టు చేసిన వారిని  విడుదల చేయాలని భారీ సంఖ్యలో ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ వద్ద జమయ్యారు. వీరు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఒక దశలో అదుపు తప్పి పోలీసు స్టేషన్‌పైకి రాళ్లు విసిరారు. ఈ రాళ్ల దాడిలో పోలీస్ స్టేషన్ అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో  హై వోల్టేజీ విద్యుత్ తీగలు తెగి ఆందోళన చేస్తున్న జనాలపై పడ్డాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post