కుప్వారా లో ఇద్దరు తీవ్రవాదుల మృతి

కుప్వారా లో ఇద్దరు తీవ్రవాదుల మృతి
కుప్వారా లో ఇద్దరు తీవ్రవాదుల మృతి
కుప్వారా జిల్లాలోని హంద్వారా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదులు మరణించారు. వీరిని లష్కర్-ఎ-తోయిబా కు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఇంకా ఎవరైనా తీవ్రవాదులు చుట్టుపక్కల దాగి ఉన్నారేమో అని భద్రతా దళాలు పరిశోధిస్తున్నాయి.

నిఘా వర్గాలకు అందిన విశ్వసనీయ సమాచారం తో హంద్వారా పోలీసులు, భద్రతా దళానికి చెందినా 21 రాష్ట్రీయ రైఫిల్స్ ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి జరిపిన సెర్చ్ ఆపరేషన్ తో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. వీరివద్ద నుండి  రెండు AK 47 రైఫిల్స్, ఆరు AK మాగజైన్స్, నాలుగు UBGL, రేడు రేడియో సెట్లు, డైరీ మరియు ఇతరత్రా సామాగ్రి దొరికాయి.  చనిపోయిన ఉగ్రవాదులను ఇంకా గుర్తించవలసి ఉంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post